Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ..

కలం, వెబ్ డెస్క్ : భారతదేశ పర్యటనలో ఉన్న అమెజాన్ సీఈఓ ఆండీ జస్సీ (Amazon CEO Andy Jassy) న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో, 2030 నాటికి భారతదేశంలో ఏఐ (AI), క్లౌడ్ మౌలిక సదుపాయాలను విస్తరించడానికి అమెజాన్ అదనంగా 13 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు జస్సీ ప్రకటించారు. ఈ పెట్టుబడులతో, రాబోయే ఐదేళ్లలో దేశంలో అమెజాన్ పెట్టే మొత్తం మూలధనం 48 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది.

“2030 నాటికి, తాము 3.8 మిలియన్ల ఉద్యోగాలతో పాటు 80 బిలియన్ డాలర్ల ఈ-కామర్స్ ఎగుమతులను సులభతరం చేయాలని, 1.5 కోట్ల చిన్న వ్యాపారాలకు, 40 లక్షల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ ప్రయోజనాలను అందించాలని ప్రణాళికలు రచిస్తున్నాం” అని సీఈవో జెస్సీ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>