కలం, వెబ్ డెస్క్: బాలయ్య నటించిన అఖండ 2(Akhanda 2) ప్రీమియర్లపై క్లారిటీ వచ్చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్ షోలకు టికెట్లను పెంచుతూ ఇచ్చిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. దీంతో ప్రీమియర్లు ఉంటాయా లేదా అనే అనుమానాల నేపథ్యంలో అఖండ 2 మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ రోజు రాత్రి ప్రీమియర్ షోలు ఉంటాయని.. సోషల్ మీడియాలో వచ్చే రూమర్లు నమ్మొద్దని కోరింది. బాలయ్య అభిమానులకు ఈ సారి నిరాశ ఉండబోదని.. గ్రాండ్ సక్సెస్ చేయాలంటూ కోరింది. అయితే పెంచిన రేట్ల ప్రకారమే ఇప్పటికే ప్రీమియర్లకు అభిమానులు టికెట్లు బుక్ చేసుకున్నారు. మరి వాళ్లకు పెంచిన అమౌంట్ రీ ఫండ్ చేస్తారా లేదా అనేది క్లారిటీ ఇవ్వలేదు.
Read Also: బిహార్లోని సీతామర్హిలో ఎయిడ్స్ కలకలం
Follow Us On: X(Twitter)


