కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ఏసీబీ (ACB) అధికారులకు మరో అవినీతి అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. హైదరాబాద్లోని నాంపల్లి సైబర్ క్రైమ్ బ్యూరోలో ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో సీఐ (Cyber Crime CI) మహేందర్ లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. ఒక కేసు విషయంలో బాధితుల నుంచి రూ.2 లక్షల నగదును డిమాండ్ చేసి తీసుకుంటుండగా అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని, ఆఫీస్లో సోదాలు నిర్వహించి కేసు నమోదు చేశారు.

