epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

40 కోట్లకు చేరువలో 5జీ వినియోగదారులు!

కలం, వెబ్​డెస్క్​: దేశంలో 5జీ వినియోగం భారీగా పెరుగుతోంది. ఈ ఏడాది నవంబర్​ నాటికి 5జీ సాంకేతిక వినియోగిస్తున్నవారి సంఖ్య (5g subscribers) 39.4కోట్లకు చేరిందని ఎరిక్​సన్​ మొబిలిటీ నివేదికను ఉటంకిస్తూ సెల్యులర్​ ఆపరేటర్స్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా (సీవోఏఐ) వెల్లడించింది. ఇది మరికొన్ని రోజుల్లోనే 40కోట్లకు చేరనుందని పేర్కొంది. కాగా, దేశంలో టెలికాం వినియోగదారుల సంఖ్య గతేడాది డిసెంబర్​ నాటికే 120కోట్లకు చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సంఖ్యలో ఎలాంటి మార్పూ లేదు. మొత్తం టెలికాం వినియోగదారుల్లో వైర్​లెస్​ బ్రాడ్​బ్యాండ్​ 96కోట్ల మందితో టాప్​లో ఉంది. వైర్​లైన్​ కనెక్షన్స్​ 45కోట్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా మొబైల్​ డేటా వాడకం సగటున నెలకు 36 జీబీగా ఉంది. ఇది 2031 నాటికి 65 జీబీకి చేరుతుందని సీవోఏఐ చెప్తోంది. అలాగే గత ఐదేళ్లలో టెలికాం ఉత్పత్తుల ఎగుమతులు 72శాతం పెరిగినట్లు తెలిపింది. 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.పదివేల కోట్ల విలువైన టెలికాం ఉత్పత్తులను ఎగుమతి చేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది రూ.18,406 కోట్లకు చేరినట్లు వెల్లడించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>