epaper
Friday, January 16, 2026
spot_img
epaper

ఇది రాజ్యాంగ ఉల్లంఘన : స్పీకర్ నిర్ణయంపై హరీశ్ రావు ఫైర్​

కలం వెబ్​ డెస్క్​: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) బుధవారం ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేయడంతో బీఆర్​ఎస్​ నేతలు ఫైర్​ అవుతున్నారు. ఆధారాలు లేవని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకున్న స్పీకర్‌పై నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే టి. హరీశ్ రావు (Harish Rao) ఈ నిర్ణయాన్ని రాజ్యాంగ ఉల్లంఘనగా అభివర్ణించారు.

ఈ నిర్ణయంపై స్పందించిన హరీశ్ రావు (Harish Rao).. రాహుల్ గాంధీ ‘రాజ్యాంగాన్ని కాపాడండి’ నినాదం ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇచ్చిన తీర్పుతో బట్టబయలైందన్నారు. ఇది రాజ్యాంగాన్ని కాపాడటం కాదు అని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి, ఆయన ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం దాన్ని మానిప్యులేట్ చేసి, దెబ్బతీస్తున్నారన్నారు. ఢిల్లీలో రాజ్యాంగ నైతికతపై ఉపన్యాసాలు ఇస్తూ, తెలంగాణలో దాన్ని ఉల్లంఘిస్తున్నదే కాంగ్రెస్, రాహుల్​ గాంధీ(Rahul Gandhi) అని మండిపడ్డారు.

Read Also: నెలాఖరుకు అసెంబ్లీ సమావేశాలు ?

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>