epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుకు స‌హ‌క‌రించండి.. కేంద్రమంత్రికి రేవంత్​ వినతి

కలం, వెబ్ డెస్క్​ : ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి (Revanth Reddy) ఢిల్లీ పర్యటనలో బిజిగా ఉన్నారు. మంగళవారం కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ (Nirmala Sitharaman) తో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు విజ్ఞప్తులు చేశారు. తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ (YIIRS) ఏర్పాటుకు స‌హ‌క‌రించాల‌ని కోరారు. రాష్ట్రంలో 105 YIIRSలు ఏర్పాటు చేయ‌నున్నామని, YIIRSల‌తో ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా మొత్తం 4 ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు మెరుగైన విద్య అందుతుందని వివరించారు. YIIRSల నిర్మాణం, ఇత‌ర విద్యా సంస్థ‌ల ఏర్పాటుకు రూ.30 వేల కోట్ల వ్య‌య‌మ‌వుతుంద‌ని, ఈ మొత్తానికి తీసుకునే రుణాల‌కు ఎఫ్ఆర్‌బీఎం నుంచి మిన‌హాయించాల‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని సీఎం రేవంత్​ రెడ్డి కోరారు.

Read Also: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. నుమాయిష్ వచ్చేస్తోంది!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>