కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. కోల్కతా వేదికగా జరిగిన అట్టహాసమైన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా సువేందు అధికారి (Suvendu Adhikari) పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆయనతో ఈ ప్రమాణం చేయించారు. ఈ అపూర్వ ఘట్టాన్ని వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా విచ్చేశారు.
కేంద్ర మంత్రులతో పాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ వేడుకలో పాల్గొన్నారు. సువేందు అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. అభివృద్ధి మార్గంలో బెంగాల్ను (West Bengal) ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్ భవన్ పరిసరాలు జనసందోహంతో కోలాహలంగా మారాయి.
Read Also: సీనియర్ కాళ్లు మొక్కిన ప్రధాని.. ఆ పెద్దాయన ఎవరో తెలుసా?
Follow Us On: WhatsApp

