కలం వెబ్ డెస్క్: తిరుపతి(Tirupati)లోని వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అన్యమత బోధన(Religious indoctrination) కలకలం రేపింది. ఆ కాలేజీలోని ఓ లెక్చరర్ మాధవి బోర్డుపై రాసిన కొన్ని అంశాలు వివాదాస్పదంగా మారాయి. “అమ్మ-నాన్న యేసుప్రభువు, అక్క-అన్న-యేసుక్రీస్తు” అంటూ ఆమె రాసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా రోజులుగా తిరుపతిలో అన్యమత ప్రచారం జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా మరోసారి ఈ ఘటన కలకలం రేపింది.
ఈ వీడియో చూసిన హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో అన్యమత ప్రచారం చేయడం సరికాదని చెబుతున్నారు. అయితే ఈ ఘటనపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
Read Also: మెస్సీని కలవడానికి నో చెప్పిన సునీల్ ఛెత్రి.. ఎందుకంటే..!
Follow Us On: Youtube


