కలం, వెబ్డెస్క్: బ్యాంకుల్లో రూ.78వేల కోట్లు.. బీమా కంపెనీల్లో రూ.14వేల కోట్లు.. మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల్లో రూ.12వేల కోట్లు.. ఈ లెక్కలు ఏంటో తెలుసా?.. అన్క్లెయిమ్డ్ సొమ్ము. అంటే, ఎవరో తమ పేరుతోనో, తమవాళ్ల పేరుతోనో దాచుకున్న సొమ్ము.. ఇన్సూరెన్స్లు, మ్యూచువల్ ఫండ్స్, డివిడెంట్స్ ద్వారా పొందాల్సిన సొమ్ము. కానీ, ఏళ్ల తరబడి ఈ సొమ్ము బ్యాంకుల్లో మూలుగుతూనే ఉంది. సరైన ఆధారాల్లేక, ఆయా ఖాతాల్లో మిగిలిపోయిన రూ.లక్షకోట్లకు పైగా సొమ్మంతా ప్రజలదే. ఇందులో మనవి, మనకు తెలిసినవాళ్లవి ఉండొచ్చు. ఈ సొమ్ము వాటి అసలైన హక్కుదారులకు చేరితే చాలు. చాలా మందికి జీవితాలే మారిపోతాయి. కానీ, తీసుకోవడం ఎలా అంటారా?కేంద్ర ప్రభుత్వం ‘యువర్ మనీ, యువర్ రైట్’ (Your Money Your Right) ద్వారా అవకాశం కల్పిస్తోంది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) బుధవారం తన లింక్డిన్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు.
ఆ సొమ్మంతా మీదే..
ప్రధాని మోదీ పోస్ట్లో ఏముందంటే..‘బ్యాంకుల్లో, ఎల్ఐసీల్లో, మ్యూచువల్ ఫండ్స్లో వేలాది మంది శ్రామికుల, ఎన్నో కుటుంబాల సేవింగ్స్, పెట్టుబడి సొమ్ము ఏళ్ల తరబడి మూలుగుతోంది. ఇదంతా వాటి హక్కుదారులకు చేరడానికి అక్టోబర్లో ‘యువర్ మనీ, యువర్ రైట్’ (Your Money Your Right) అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. ఈ పనిని అత్యంత పారదర్శకంగా, వేగంగా, సులభంగా జరిగేందుకు వీలుగా ఆర్బీఐ–ఉద్గమ్ పోర్టల్, ఐఆర్డీఏఐ బీమా భరోసా పోర్టల్, సెబీ–మిత్ర పోర్టల్, కార్పొరేట్ వ్యవహారాల శాక ఐఈపీఎఫ్ఏ పోర్టల్ అందుబాటులోకి తెచ్చాం. రెండు నెలల్లోనే వీటి ద్వారా సుమారు రూ.2వేల కోట్లను అసలైన హక్కుదారులకు చేర్చాం. అలాగే అన్క్లెయిమ్డ్ ఖాతాల్లో మీకు సంబంధించిన సొమ్ము ఉంటే, ఆధారాలు సమర్పించి తీసుకోవాలి.’ అని ప్రధాని మోదీ కోరారు.
Read Also: ప్రభాస్, అర్జున్ కపూర్ మాత్రమే నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ -కృతి సనన్
Follow Us On: Youtube


