కలం, వెబ్డెస్క్: శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Shamshabad Airport) బాంబుల బెదిరింపు ఆగడం లేదు. ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే విమానాల్లో ఇప్పటికే ఆరింటికి బాంబు బెదిరింపు(Bomb Threat) మెయిల్స్, కాల్స్ రాగా తాజాగా మంగళవారం మరో బెదిరింపు మెయిల్ వచ్చింది. మిలియన్ డాలర్లు ఇవ్వకుంటే అమెరికా వెళ్లే ఓ విమానం పేలిపోతుందంటూ మెయిల్ వచ్చింది. దీంతో సీఐఎస్ఎఫ్ బృందం.. ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బందితో కలసి విస్తృత తనిఖీలు చేసింది. కార్గో జోన్స్, పార్కింగ్ ఏరియాలతో పాటు షెడ్యూల్ అయిన అన్ని విమానాలనూ క్షుణ్నంగా సోదా చేసింది. ప్రయాణికులను సైతం మరో దఫా తనిఖీ చేసింది.
అయితే, అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. మరోవైపు సైబర్ సెక్యూరిటీ అధికారులు బెదిరింపు మెయిల్ అమెరికా నుంచి జస్పర్ అనే వ్యక్తి పేరుతో వచ్చినట్లు గుర్తించారు. దీనిపై తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఒకవైపు ఇండిగో సంక్షోభం కొనసాగుతుండగా మరోవైపు ఇలా తరచూ బాంబు బెదిరింపులు రావడం ప్రయాణికులకు, భద్రతా సిబ్బందికి చికాకుగా మారింది. ఈ నెల5న, 6న, 8న సైతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ (Shamshabad Airport) కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ఆరు విమానాలకు బెదిరింపు మెయిల్స్, కాల్స్ వచ్చాయి. రాజధానిలో ప్రతిష్ఠాత్మక గ్లోబల్ సమ్మిట్ జరుగుతుండగా ఎయిర్పోర్ట్కు ఇలా వరుసగా బెదిరింపులు వస్తుండడంతో అధికారుల్లో టెన్షన్ నెలకొంది.
Read Also: సల్మాన్ ఖాన్ వెంచర్స్ ధమాకా: ఫ్యూచర్ సిటీలో 10 వేల కోట్ల పెట్టుబడి
Follow Us On: X(Twitter)


