కలం, వెబ్ డెస్క్: అసలే ఐదు రోజుల నుంచి ఇండిగో సంక్షోభం.. ఆపై విమానాలకు వరుసగా బెదిరింపులు.. వెరసి తెలంగాణ ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నాయి. నగరంలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్(Global Summit)ను ప్రతిష్టాత్మకత్మంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్య్రమానికి దేశ విదేశాల నుంచి ప్రముఖ వ్యాపారవేత్తలు, కంపెనీల ప్రతినిధులు,రాజకీయ నేతలు తరలిరానున్నారు. దీంతో ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేసింది.అన్ని సౌకర్యాలూ కల్పిస్తోంది. ఈ క్రమంలో విమానాలకు బాంబు బెదిరింపు రావడం అధికారులను, ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. సమ్మిట్ పై ప్రభావం చూపుతుందని భయపడుతోంది.
నాలుగు రోజుల్లో ఆరు విమానాలకు..:
అసలే ఇండిగో సంక్షోభంతో దేశవ్యాప్తంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.వందలాది ఫైట్ల రద్దుతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.ఇదే సమయంలో విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్, కాల్స్ రావడం కలవరం కలిగిస్తోంది.శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే విమానాలకు ఏకంగా నాలుగు రోజుల్లో మూడు సార్లు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ నెల 5న దుబాయ్ – హైదరాబాద్ ఎమిరేట్స్ ఫ్లైట్ కు మొదట బాంబు బెదిరింపు వచ్చింది. ఆ తర్వాత 6న బ్రిటిష్ ఎయిర్ వేస్ ఫ్లైట్, కువైట్ ఎయిర్ వేస్ ఫ్లైట్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. నేడు ఏకంగా మూడు విమానాలకు బాంబు బెదిరింపు వచ్చింది. కన్నూర్ నుంచి హైదరాబాద్కు వచ్చే ఇండిగో సర్వీస్ తోపాటు హైదరాబాద్–లండన్ బ్రిటిష్ ఎయిర్ వేస్, ఫ్రాంక్ ఫర్ట్ – హైదరాబాద్ లుఫ్తాస్సా సర్వీస్ లకు బాంబు థ్రెట్ మెయిల్స్ వచ్చాయి. దీంతో ఆ విమానాలు గంటల తరబడి తనిఖీకి నిలిచిపోయాయి.
ప్రభుత్వం అప్రమత్తం:
రాజధానిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్(Global Summit) కు 44 దేశాల నుంచి 154 మంది ప్రముఖులు రానున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వీరితోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తరలిరానున్న వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల రాకపోకలకు కీలకం విమానాలే. ఈ క్రమంలో ఇండిగో సంక్షోభం,విమానాలకు బాంబు బెదిరింపులు సదస్సుపై ప్రభావం చూపిస్తాయని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దీనిపై ఇప్పటికే అప్రమత్తమైన అధికారులు తగిన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది.
Read Also: వాట్సాప్ కనుమరుగు కానుందా?
Follow Us on: Youtube


