కలం, స్పోర్ట్స్: భారత్ వర్సెస్ జింబాబ్వే టీ20 మ్యాచ్లో టీమిండియా పరుగుల సునామీ సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల భారీ స్కోరు సాధించి, జింబాబ్వే ముందు 257 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
భారత బ్యాటర్లు ఆరంభం నుండే జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డారు. అభిషేక్ శర్మ 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 55 పరుగులు చేసి ఇన్నింగ్స్కు గట్టి పునాది వేశాడు. హార్దిక్ పాండ్యా చివర్లో మెరుపులు మెరిపిస్తూ 23 బంతుల్లో 50 పరుగులు (నాటౌట్) సాధించాడు. తిలక్ వర్మ కేవలం 16 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 44 పరుగులు చేసి 275.00 స్ట్రైక్ రేట్తో విరుచుకుపడ్డాడు. ఇషాన్ కిషన్ (38), సూర్యకుమార్ యాదవ్ (33), సంజూ శాంసన్ (24) కూడా వేగంగా పరుగులు జోడించారు.
భారత బ్యాటర్ల ధాటికి జింబాబ్వే బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. సికందర్ రజా 3 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇతని ఎకానమీ (9.66) జట్టులో అందరికంటే తక్కువగా ఉంది. రిచర్డ్ న్గరవ 4 ఓవర్లలో అత్యధికంగా 62 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. బ్లెస్సింగ్ ముజరబానీ 4 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. టినోటెండ మాపోసా కేవలం 2 ఓవర్లలోనే 40 పరుగులు సమర్పించుకున్నాడు. మరి భారత్ ఇచ్చిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో జింబాబ్వే బ్యాటర్లు ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.
Read Also: నిన్న స్నేహితురాలు, నేడు అర్ధాంగి.. పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్
Follow Us On: X(Twitter)

