epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఓటముల బాధ్యత గంభీర్‌ది కాదు: రైనా

టెస్ట్ మ్యాచ్‌లలో టీమిండియా చవి చూస్తున్న వరుస ఓటములకు కోచ్ గంభీర్(Gautam Gambhir) బాధ్యుడు కాదంటూ టీమిండియా మాజీ ప్లేయర్ సురేశ్ రైనా(Suresh Raina) కీలక వ్యాఖ్యలు చేశారు. గెలుపోటములకు కోచ్‌ కన్నా ఆటగాళ్లకే బాధ్యత ఎక్కువ ఉంటుందని వివరించాడు. అయితే టెస్ట్ మ్యాచ్‌లలో టీమిండియా పేలవమైన ప్రదర్శన కనబరుస్తోంది. స్వదేశంలో కూడా వరుస ఓటములను చవిచూస్తోంది. ఇండియాలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో వైట్ వాష్ అయింది. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్‌లలో కూడా వరుస పరాజయాలనే ఎదుర్కొంటోంది. తొలి టెస్ట్ ఓడిన భారత్.. రెండో టెస్ట్‌లో కూడా ఓటమి దిశగానే పయనిస్తోంది. ఇప్పటికే 0-1తో వెనకబడి ఉన్న టీమిండియా కోల్‌కతా వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో కూడా దారుణమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. కోచ్‌గా గంభీర్‌ను తొలగించాలన్న డిమాండ్స్ కూడా భారీగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ విమర్శలపై టీమిండియా మాజీ ప్లేయర్ సురేష్ రైనా స్పందించాడు.

ఓటములకు కోచ్ కన్నా ఆటగాళ్లే ఎక్కువ బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పాడు రైనా(Suresh Raina). కోచ్‌గా గంభీర్ తన పని తాను చేస్తున్నాడని అన్నాడు. గంభీర్ కోచ్‌.. ఆటగాళ్లకు దిశానిర్దేశం మాత్రమే చేస్తాడు, పరుగులు చేయాల్సింది బ్యాటర్లే, వికెట్లు తీయాల్సింది బౌలర్లే అని వివరించాడు. ఓటములను చూసి ఆటగాళ్లు గెలుపుపై విశ్వాసం కోల్పోకూడదని చెప్పాడు. తాను ఆడే సమయంలో సిరీస్‌లో వెనకబడినా తిరిగి కచ్ఛితంగా పుంజుకుంటామనే నమ్మంతో ముందకెళ్లేవాళ్లమని గుర్తు చేశాడు. బ్యాటింగ్‌లో భాగస్వామ్యాు నెలకొల్పడంపైనే విజయం ఆధారపడి ఉంటుందని వివరించాడు.

Read Also: స్మృతి మందానాను పలాష్ చీట్ చేశాడా..!

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>