కలం, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ (Tirumala Laddu)లో కల్తీ నెయ్యి అంశంపై మంగళవారం అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 4 గంటల పాటు చర్చ జరుగుతుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చర్చ కొనసాగనుంది. కూటమికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు మాట్లాడనున్నారు. మంగళవారం సభలో ప్రశ్నోత్తరాల తర్వాత జీరో అవర్ రద్దు చేస్తారు. మరోవైపు వైసీపీ నేతలు తిరుమల లడ్డూపై శాసన మండలిలో చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: జాబ్ క్యాలెండర్లోనే టీచర్ పోస్టులు : లోకేశ్
Follow Us On: Sharechat


