కలం, వెబ్ డెస్క్ : ప్రఖ్యాత కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) ఉత్పత్తి చేసే ఐకానిక్ మైసూర్ శాండల్ సోప్ (Mysore Sandal Soap) వంటి హెరిటేజ్ ఉత్పత్తుల కోసం.. సినీ నటి తమన్నా భాటియాను (Tamannaah Bhatia) బ్రాండ్ అంబాసిడర్గా అధికారికంగా నియమించినట్లు కర్ణాటక ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఆమె ఈ బాధ్యతను ఫిబ్రవరి 10, 2026 నుంచి రెండు సంవత్సరాల పాటు నిర్వహించనున్నారు. ఈ నిర్ణయంలో భాగంగా మైసూర్ శాండల్ సోప్కి సరికొత్త ప్యాకేజింగ్తో రీ లాంచ్ కూడా నిర్వహిస్తున్నారు. దీనితో ప్రొడక్ట్ మార్కెట్ విజిబిలిటీ పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.


