కలం, వరంగల్ బ్యూరో : జనగామ (Jangaon) జిల్లా చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామంలో జరిగిన సమ్మక్క – సారలమ్మ జాతర (Sammakka Saralamma Jatara) హుండీలో అజ్ఞాత భక్తురాలి లేఖ బయటపడింది. సోమవారం జాతరలోని హుండీల్లో వచ్చిన కానుకలు లెక్కిస్తుండగా ఓ మహిళా భక్తురాలు ‘నాకు ప్రభుత్వం ఉద్యోగం, శ్రీధర్తో పెళ్లి అయ్యేలా చూడు తల్లి ఈ రెండు కోరికలు తీరిస్తే రానున్న జాతరలో తోచిన బంగారం ఇస్తానంటూ లేఖలో పేర్కొంది. ఈ లేఖ సామాజిక మధ్యమాల్లో వైరల్ గా మారింది.

Read Also: కేసీఆర్ ను ఎవరూ ఈడ్చుకురాలేదు : సీఎం రేవంత్
Follow Us On: X(Twitter)


