కలం, తెలంగాణ బ్యూరో: భారత్ పై టారిఫ్ ను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం.. దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Markets) లో జోష్ నింపాయి. మంగళవారం ఉదయం 9.15 గంటలకు సెన్సెక్స్ 3647 పాయింట్లు, నిఫ్టీ 1219 పాయింట్ల ప్లస్ తో ఓపెన్ అయ్యాయి. ఇంతలా ఓపెన్ కావడం రికార్డు. రిలయెన్స్, హెడ్ డీఎఫ్ సీ షేర్లు భారీగా పెరిగాయి. ఐటీ స్టాక్స్ అయితే7 శాతం గ్రీన్ లో ఓపెన్ అయ్యాయి. ఆదివారం బడ్జెట్ టైమ్ లో కుప్పకూలిన స్టాక్స్.. సోమవారం కాస్త కోలుకోగా.. మంగళవారం ఉదయం భారీ లాభాల్లో ఓపెన్ అయ్యాయి. ఇన్వెస్టర్లకు లాభాల పంట పండింది.


