epaper
Monday, January 19, 2026
spot_img
epaper

మున్సి‘పోల్స్​’కు కాంగ్రెస్​ స్క్రీనింగ్​ కమిటీలు ఏర్పాటు

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్​ ఎన్నికల (Municipal Elections) కు కాంగ్రెస్​ పార్టీ సన్నాహాలు మొదలు పెట్టింది. పంచాయతీ ఎన్నికల ఫలితాల మాదిరిగానే పురపొరులోనూ సత్తా చాటాలని ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికకు పార్టీ కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం టీపీసీసీ ఆధ్వర్యంలో స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్​ ప్రకటించారు.

పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఈ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి పార్లమెంట్ కు ఇన్​ చార్జ్ మంత్రి చైర్మన్ గా, పార్లమెంట్ పరిధిలోని డీసీసీ అధ్యక్షులు కన్వీనర్ లుగా, పార్లమెంట్ నియోజక వర్గంలోని ఎంపీ, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు, సీనియర్ నాయకులతో కమిటీలు వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అభ్యర్థుల ఎంపికలో స్క్రీనింగ్​ కమిటీలదే కీలక పాత్ర అని టీపీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ స్పష్టం చేశారు.

వీలైనంత త్వరగా మన్సిపల్​ ఎన్నికలు (Municipal Elections) నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో 2996 వార్డులు, డివిజన్లలో ఎలక్షన్స్​ జరగాల్సి ఉంది. దీంతో ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు కూడా కావడంతో.. రాష్ట్ర కేబినెట్​ ఫిబ్రవరిలో ఎన్నికలు పూర్తి చేయడానికి షెడ్యూల్​ రూపొందించాలని అధికారులకు సూచించింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్​ రెడ్డి ఇన్​ చార్జ్ లను కూడా నియమించారు. పార్లమెంట్​ నియోజకవర్గాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Read Also : మేడారంలో జియోట్యాగింగ్‌ సేవలు

Follow Us On : Twitter

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>