కలం, వరంగల్ బ్యూరో: మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో నిర్మించిన పైలాన్ను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం ఆవిష్కరించారు. సీఎం ఆదివారం రాత్రి మేడారంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన హరిత హోటల్లో బస చేశారు. సోమవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఆధునీకరించిన గద్దెలను (Gaddelu) ప్రారంభించారు. ఆ తర్వాత కుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకుని హైదరాబాద్కు తిరుగుప్రయాణం అవుతారు. గద్దెలను పూలతో అందంగా అలంకరించారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.


