కలం, వెబ్డెస్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్థంతి సందర్భంగా ఆయనకు ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) నివాళి అర్పించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు ఆదివారం ఉదయాన్నే చేరుకొని, తాత సమాధిపై బొకేలు ఉంచి అంజలి ఘటించారు. ఆయనతోపాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. అలాగే సినీ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ సైతం ఎన్టీఆర్ ఘాట్ వద్ద తాత సమాధికి నివాళి అర్పించారు. తెలంగాణ సచివాలయానికి సమీపంలోని ఈ ఘాట్ను ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అలంకరించారు. అలాగే ఎన్టీఆర్మూవీ, పొలిటికల్ జర్నీకి సంబంధించిన ఫొటోలతో ప్రదర్శన ఏర్పాటుచేశారు. పోలీసులు ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా పర్యవేక్షించారు.
Read Also: హోమ్ లోన్ కట్టేశారా.. ఇలా చేస్తే బ్యాంకులే మీకు డబ్బు చెల్లిస్తాయి
Follow Us On: Youtube



