epaper
Sunday, January 18, 2026
spot_img
epaper

ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఇక రచ్చరచ్చే!

కలం, వెబ్ డెస్క్ : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు, చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) కు కర్ణాటక ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఎం. చిన్నస్వామి స్టేడియానికి అంతర్జాతీయ మ్యాచ్‌లు, ఐపీఎల్ పోటీలు మళ్లీ నిర్వహించేందుకు అధికారిక అనుమతి లభించింది. ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం ప్రెస్ రిలీజ్ ద్వారా వెల్లడించింది. గత ఏడాది జూన్ 4న జరిగిన ట్రోఫీ వేడుకలో తొక్కిసలాట చోటు చేసుకోవడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆ విషాద ఘటన తర్వాత స్టేడియంపై కఠిన ఆంక్షలు విధించారు. దాంతో విజయ్ హజారే ట్రోఫీ, మహిళల వరల్డ్ కప్ మాత్రమే కాదు, పురుషుల టీ20 వరల్డ్ కప్‌కు కూడా బెంగళూరు దూరమైంది. ప్రభుత్వం నిర్దేశించిన కఠిన నిబంధనలను పాటించిన పక్షంలోనే ఈ అనుమతి చెల్లుబాటు అవుతుందని KSCA స్పష్టం చేసింది. భద్రత, సెక్యూరిటీ, ప్రేక్షకుల నియంత్రణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి బాధ్యతతో అమలు చేస్తామని సంఘం భరోసా ఇచ్చింది.

Chinnaswamy Stadium
Chinnaswamy Stadium

Read Also: కొత్త మోడల్‌తో పీఎస్ఎల్ 11వ సీజన్ !

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>