epaper
Wednesday, March 4, 2026
epaper

కాంగ్రెస్​, డీఎంకే సీట్ల డీల్​ ఓకే

కలం, వెడ్​ డెస్క్: తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి డీఎంకే, కాంగ్రెస్​ పార్టీల(DMK – Congress) మధ్య డీల్​ ఓకే అయ్యింది. ఈ మేరకు సీఎం స్టాలిన్, కాంగ్రెస్​ టీఎన్​ పీసీసీ ధ్యక్షుడు కె.సెల్వపెరుతగై సమక్షంలో రెండు పార్టీల అగ్ర నాయకుల మధ్య బుధవారం జరిగిన రెండో విడత చర్చలు ఫలించాయి. ఒప్పందం ప్రకారం శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్​ 28 స్థానాల్లో పోటీ చేయనుంది. అలాగే, ప్రస్తుతం రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ సీట్లలో ఒకటి కాంగ్రెస్​కు ఇచ్చేందుకు డీఎంకే అంగీకరించింది. అనంతరం ఇరు పార్టీ నాయకుల సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

చెన్నైలోని డీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివలయంలో జరిగిన ఈ భేటీలో డీఎంకే నాయకులు, ఎంపీ కనిమొళితోపాటు (DMK – Congress) కాంగ్రెస్​ నాయకులు గిరిష్​ చోదంకర్​, రాజేశ్​ కుమార్​, నివేదిత్​ ఆల్వా తదితరులు ఉన్నారు. ఈ డీల్​ను డీఎంకే సారథ్యంలోని సెక్యులర్​ ప్రోగ్రెసివ్​ అలయెన్స్​(ఎస్​పీఏ) కూటమి విజయానికి మొదటి అడుగుగా నేతలు అభివర్ణించారు. డీఎంకే, పీఎంకే, వీసీకే, కాంగ్రెస్​తో కూడిన ఎస్​పీఏ కూటమి గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. ఇందులో డీఎంకే 133, కాంగ్రెస్​ 18, పీఎంకే 5, వీసీకే 4 సీట్లు గెలిచాయి.

234 సీట్లు ఉన్న తమిళనాడు అసెంబ్లీకి ఈ ఏడాది మేలో ఎన్నికలు జరగనున్నాయి. అధికార డీఎంకే కూటమి ‘ద్రవిడియన్​ మోడల్​ 2.0’ పేరుతో రెండో దఫా విజయం సాధించాలని భావిస్తోంది. మరోవైపు బీజేపీ–ఏఐఏడీఎంకే కూటమి, నటుడు విజయ్​ సారథ్యంలోని టీవీకే పార్టీలు కూడా బరిలో ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!