కలం, వెబ్ డెస్క్: అసలే రకరకాల కారణాలతో అమెరికా, ఆస్ట్రేలియా, యూకే స్టూడెంట్స్ వీసాలకు కోత వేస్తున్న వేళ.. భారత విద్యార్థులకు కెనడా(Canada) ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తమ దేశానికి చదువుకోసం వచ్చే భారత విద్యార్థులకు 100 మిలియన్ డాలర్ల విలువైన 200 స్కాలర్షిప్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. యూనివర్సిటీ ఆఫ్ టొరంటో వీటిని స్పాన్సర్ చేస్తుందని వెల్లడించింది. భారత విద్యార్థులకు గత ఐదేళ్లలో 700కు పైగా స్కాలర్షిప్లు అందించగా, ఈసారి మరింత పెంచనున్నట్లు తెలిపింది. దీనికోసం 25 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు పేర్కొంది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ భారత పర్యటన ముగిసిన కాసేపటికే ఈ నిర్ణయం ప్రకటించింది.
దీంతో పాటు భారత విద్యార్థులకు, విద్యారంగానికి ఉపయోగపడే మరిన్ని ప్రయోజనాలు కల్పించనున్నట్లు కెనడా(Canada) వెల్లడించింది. రెండు దేశాల్లోని యూనివర్సిటీల మధ్య భాగస్వామ్యం; స్టడీ, ఎక్ఛేంజ్ అవకాశాలపై పరస్పర సహకారం; భారత్లో మూడు హైబ్రిడ్ స్టడీ లొకేషన్స్ ఏర్పాటు; కళలు, విజువల్ ఆర్ట్స్, మ్యూజిక్, పబ్లిషింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ టెక్నాలజీ బలోపేతంపై ఒప్పందం; ఐఐటీ తిరుపతి, ఐసర్ తిరుపతిలో డల్హౌసీ యూనివర్సిటీ ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటు వంటివి ఇందులో ఉన్నాయి.

