కలం, వెబ్డెస్క్: మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒక పక్క ఎన్కౌంటర్లు, మరో పక్క లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం భారీ స్థాయిలో నక్సలైట్లు లొంగిపోయారు (Naxalites Surrender). చత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ అధికారుల ఎదుట 52 మంది నక్సలైట్లు ఆయుధాలతో సహా లొంగిపోయారు. వీళ్లంతా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డీకేఎస్జడ్సీ), ఆంధ్ర–ఒడిశా బోర్డర్ డివిజన్ అండ్ బ్రహ్మఘర్ ఏరియా కమిటీ (మహారాష్ట్ర) సభ్యులు. వీళ్లలో 49 మంది మీద రూ.1.41కోట్ల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయినవాళ్లలో 21 మంది మహిళలు ఉన్నారు. నక్సలైట్ల కోసం ప్రకటించిన పూనా (పునరావాసం, జనజీవన స్రవంతి) కార్యక్రమం కింద వీళ్లందరూ లొంగిపోయినట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ వెల్లడించారు.
దేశాన్ని 2026 మార్చి 31 లోగా నక్సల్స్ రహితంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఒక పక్క కూంబింగ్లు, ఎన్కౌంటర్లు జరుగుతుండగా, మరో పక్క లొంగుబాటు కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఫలితంగా 2025 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఏకంగా 1,500 మంది నక్సలైట్లు లొంగిపోయి (Naxalites Surrender), జనజీవన స్రవంతిలో కలిశారు.
Read Also: మీకు పీఎఫ్ ఉందా.. రూ.7లక్షల ఫ్రీ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోండి..!
Follow Us On: Pinterest


