epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రైతులకు ప్రభుత్వం గుడ్​న్యూస్​.. ఆ నిధులు విడుదల

కలం, వెబ్​డెస్క్​: తెలంగాణలో రైతులకు గుడ్​న్యూస్. అన్నదాతలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ఇచ్చింది. సన్నాలకు ప్రకటించిన బోనస్ (Paddy Bonus)​ సొమ్ము రూ.500కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఆదేశాలతో బోనస్​ సొమ్మును విడుదల చేసినట్లు పౌర సరఫరాల శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ డబ్బును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొంది. దీంతో కలుపుకొని ఈ సీజన్​లో ఇప్పటివరకు రూ.1,425.91 కోట్లను బోనస్​ రూపంలో సన్నాలకు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఇది కనీస మద్దతు ధరకు అదనం. ఈ ప్రకారం ఎంఎస్​పీతో కలసి క్వింటాల్​కు రూ.2,889ని రైతులకు ఇచ్చారు. కాగా, సన్నాలకు బోనస్​ ఇస్తామంటూ గతంలోనే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ​

Read Also: రాముని జోలికి వస్తే ఊరుకునేది లేదు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>