కలం, వెబ్డెస్క్: పొలిటికల్ కన్సల్టెన్సీ ఐప్యాక్పై గురువారం ఈడీ దాడు (ED raids on IPAC) లు చేసింది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా కోల్కతాలోని ఆ సంస్థ కార్యాయంతోపాటు, డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇంటిలో సోదాలు జరిపింది. ఈ విషయం తెలిసి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కోల్కతా పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మ, టీఎంసీ నాయకులతో కలసి ప్రతీక్ జైన్ ఇంటికి వెళ్లడం కలకలం రేపింది. అనంతరం ఈ విషయంపై ఐప్యాక్పై ఈడీ రైడ్స్ను రాజకీయ కక్ష్యగా మమతా బెనర్జీ ఆరోపించారు. ‘ఐప్యాక్ టీఎంసీకి రాజకీయ కన్సల్టెన్సీ. మా పార్టీ రాజకీయ వ్యూహాలు, అభ్యర్థుల జాబితా, రహస్య సమాచారం తెలుసుకునేందుకే ఈడీతో దాడులు చేయిస్తున్నారు. టీఎంసీ పార్టీకి సంబంధించిన హార్డ్ డిస్క్ను తీసుకెళ్లేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. దేశాన్ని సురక్షితంగా ఉంచలేని దుష్ట హోంమంత్రి అమిత్ షా ఈ దుర్మార్గ పని వెనక ఉన్నారు. ఆయన మా పార్టీ అభ్యర్థుల డేటా లాక్కోవాలనుకుంటున్నారు. ఒక వైపు ‘సర్’ పేరుతో ఓట్లు తొలగిస్తున్నారు. మరోవైపు ఇలా అన్యాయంగా మా పార్టీ డేటా తీసుకోవాలనుకుంటున్నారు. మీలాగే నేనూ మీ పార్టీ డేటా తీసుకోవాలనుకుంటే ఏం జరుగుతుంది?’ అని దీదీ మండిపడ్డారు.
కాగా, సోదాలను అడ్డుకోవడంపై ఈడీ స్పందించింది. ‘బొగ్గు స్కామ్లో వచ్చిన డబ్బును గోవా ఎన్నికల్లో వాడేందుకు ఐప్యాక్కు టీఎంసీ ఇచ్చినట్లు కేసు ఫైల్ అయ్యింది. ఇందులో ఆధారాల సేకరణకు ప్రయత్నిస్తుంటే రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్లు అడ్డుపడడం తగదు’ అని ఈడీ పరోక్షంగా మమతను ఉద్ధేశించి వ్యాఖ్యానించింది. మరోవైపు ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మేల్య సువేందు అధికారి ఈ ఘటనపై స్పందించారు. ‘రాజ్యాంగ బద్ధ సంస్థ అయిన ఈడీ దాడు (ED raids on IPAC ) లను అడ్డుకోవడం, సోదాలకు అంతరాయం కలిగించడం సరికాదు. మమతపై ఈడీ చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు. కాగా, పొలిటికల్ కన్సల్టెన్సీ ఐప్యాక్ను 2014 లోక్సభ ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిశోర్, ప్రతీక్ జైన్ స్థాపించారు. ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడుగా ప్రతీక్ జైన్ పనిచేస్తున్నారు. ఈయన ఆధ్వర్యంలో 2019 నుంచి ఐప్యాక్ సంస్థ టీఎంసీకి ఎన్నికల కన్సల్టెన్సీగా పనిచేస్తోంది. టీఎంసీ ఐటీ వింగ్ హెడ్గా ప్రతీక్ జైన్ పనిచేస్తున్నారు.


