epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

బంగ్లాదేశ్​లో హిందూ జర్నలిస్ట్​ దారుణ హత్య

కలం, వెబ్​డెస్క్​: బంగ్లాదేశ్​లో హిందువులపై దాడులు ఆగడం లేదు. అల్లరి మూకలు ఇప్పటికే నలుగురు హిందువులను బలి తీసుకోగా, సోమవారం మరో హిందూ వ్యక్తిని హత్య చేశారు. ఈ ఘటన దక్షిణ బంగ్లాదేశ్​లో జరిగింది. జెషోర్​ జిల్లా అరువ గ్రామంలో నివసించే రాణా ప్రతాప్ బైరాగి (38) ఐస్​ ఫ్యాక్టరీ నడుపుతూ, ఒక డైలీ పేపర్​కు తాత్కాలిక ఎడిటర్​ (Bangladesh Hindu Journalist) గా పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఐస్​ ఫ్యాక్టరీలో రాణా ప్రతాప్​ ఉండగా, మోటార్​ బైక్​పై వచ్చిన దుండగులు అతడిని బయటకు రప్పించి, కాల్పులు జరిపారు. అతి సమీపం నుంచి కాల్చడంతో తలలో బుల్లెట్లు దిగి, ఆయన అక్కడికక్కడే చనిపోయారు.

ఈ సంఘటన బంగ్లాదేశ్​లో శాంతిభద్రతలపై మరోసారి తీవ్ర ఆందోళనలు రేకెత్తించింది. అయితే, రాణా ప్రతాప్ ​పై పలు కేసులు ఉన్నాయని పోలీసులు చెప్పగా, వాటన్నింటిలోనూ అతను నిర్దోషిగా తేలాడని ప్రతాప్ పనిచేస్తున్న పత్రిక న్యూస్​ పేపర్​ యజమాని​ అబుల్​ తెలిపారు. హత్యకు కారణాలు తెలియదని అబుల్​ చెప్పినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. బంగ్లాదేశ్​లో అల్లర్లు మొదలైనప్పటి నుంచి హిందువులపై దాడులు, హత్యలు కొనసాగుతుండగా తాత్కాలిక ప్రభుత్వం నడుపుతున్న మహ్మద్​ యూనస్​ మాత్రం పట్టించుకోవడం లేదు.

Bangladesh Hindu Journalist
Bangladesh Hindu Journalist

Read Also: ఐపీఎల్ పై బంగ్లాదేశ్​ సంచలన నిర్ణయం..

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>