కలం, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్లో ఐపీఎల్ ప్రసారాలను నిషేధిస్తూ (IPL Ban) ఆ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ (Bangladesh) లో హిందువులపై జరుగుతున్న వరుస హింసాకాండలపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన బీసీసీఐ.. ఐపీఎల్ టోర్నీలో కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టుకు చెందిన బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ (Mustafizur Rahman) ను తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ముస్తఫిజుర్ ను కోల్ కత్తా నైట్ రైజర్స్ తప్పించింది.
ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన బంగ్లాదేశ్ ప్రభుత్వ ఐపీఎల్ ప్రసారాలను బ్యాన్ (IPL Ban) చేసింది. ఆ దేశానికి చెందిన ఆటగాడు ముస్తఫిజుర్ రెహమాన్ ను రిలీజ్ చేయడాన్ని తప్పుబడుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో బంగ్లాదేశ్ లో ఐపీఎల్ ప్రసారాలు నిలిచిపోతున్నాయి. అంతకు ముందు భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ లో భారత్ వేదికలపై తాము ఆడబోమంటూ ఐసీసీకి లేఖ రాసింది. తాజా పరిణామాలతో భారత్, బంగ్లా మధ్య దూరం పెరుగుతోంది.
Read Also: జేడీ వాన్స్ నివాసంపై దాడి.. ఒకరి అరెస్ట్
Follow Us On: Youtube


