epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

పెండ్లి వేడుకల్లో విషాదం.. సర్పంచ్​ను కాల్చి చంపిన దుండగులు

కలం, వెబ్ డెస్క్​ : పంజాబ్​లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నాయకుడు, సర్పంచ్​ (AAP Sarpanch) ను దుండగులు కాల్చి చంపడం కలకలం సృష్టించింది. తరణ్‌తరణ్​ జిల్లాకు చెందిన సర్పంచ్​ జర్మల్​ సింగ్​ (Jarmal Singh) ఆదివారం ఓ పెళ్లి వేడుకలకు హాజరయ్యారు. ఈ క్రమంలో గుర్తు తెలియని దుండగులు పెళ్లి వేడుకల్లోకి చొరబడి సినీ ఫక్కీలో కాల్పులు జరిపారు. తలకు బుల్లెట్​ తగలడంతో జర్మల్​ సింగ్​ తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన చనిపోయాడు. కాల్పులతో ఒక్కసారిగా పెళ్లి వేడుకల్లో విషాదం నిండిపోయింది.

ఆమ్​ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సర్వన్​ సింగ్ ధున్​ కూడా పెళ్లి వేడుకల్లో ఉండగానే ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్​ 15న మొహాలీలో టోర్నమెంట్​  సందర్భంగా ముగ్గురు దుండగుల కాల్పుల్లో కబడ్డీ ప్లేయర్​ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన కొన్ని వారాలకే సర్పంచ్​ జర్మల్​ సింగ్​ను కూడా దుండగులు కాల్చి చంపడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, గుర్తు తెలియని దుండగలు జర్మల్​ సింగ్ పై రెండు రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.

AAP Sarpanch
AAP Sarpanch

Read Also:  దీదీకి షాక్​.. నందిగ్రామ్​లో బీజేపీ స్వీప్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>