కలం, వెబ్ డెస్క్ : భారతదేశ ఎంతో ఆతృతంగా ఎదురుచూస్తున్న ప్రజలు బుల్లెట్ ట్రైన్ (Bullet Train) వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పట్టాలెక్కనుంది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) కీలక ప్రకటన చేశారు. గురువారం ఆయన రైల్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి బుల్లెట్ ట్రైన్ సిద్ధమవుతుందని చెప్పారు. మొదటి హై స్పీడ్ ట్రైన్ సూరత్ – బిలిమోరా మార్గంలో నడుస్తుందని తెలిపారు.
నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) చేపట్టిన ఈ ప్రాజెక్టును దశల వారీగా ప్రారంభిస్తుందని కేంద్రమంత్రి తెలిపారు. మొదటి దశలో భాగంగా సూరత్ – బిలిమెరా మార్గం నిర్మించననున్నట్లు చెప్పారు. ఆ తర్వతా వాపి – సూరత్, వాపి– అహ్మదాబాద్, థానే – అహ్మదాబాద్ మార్గంలో సేవలు ప్రారంభమవుతాయన్నారు. చివరి దశలో ముంబై – అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ మొత్తం అందుబాటులోకి వస్తుందని అశ్వినీ వైష్ణవ్ వివరించారు.
ప్రాజెక్ట్ వ్యయం 1,08,000 కోట్లు
508 కిలోమీటర్లు పొడవైన ముంబై – అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ (MAHSR) ప్రాజెక్టులో ముంబై, థానే, విరార్, బోయిసర్, వాపి, బిల్లిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి అనే 12 స్టేషన్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. రూ. 1,08,000 కోట్లు కేటాయించారు. వీటిలో జపాన్ కు చెందిన ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ రూ.88,000 కోట్ల నిధులు సమకూరుస్తోంది. డిసెంబర్ 2029 నాటికి ముంబై – అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్న రైల్వే శాఖ. బుల్లెట్ ట్రైన్ (Bullet Train) అందుబాటులోకి వస్తే ముంబై – అహ్మదాబాద్ మద్య రెండు గంటల సమయం తగ్గుతుంది.
Read Also: అణు కేంద్రాల రక్షణ.. భారత్-పాక్ కీలక ఒప్పందం
Follow Us On: X(Twitter)


