epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఖలీదా జియా అంత్యక్రియలు.. హాజరైన జైశంకర్​

కలం, వెబ్​డెస్క్​: బంగ్లాదేశ్​ మొదటి మహిళా ప్రధాని, బంగ్లాదేశ్​ నేషనలిస్ట్​ పార్టీ అధినేత్రి ఖలీదా జియా అంత్యక్రియలు (Khaleda Zia Funeral) ముగిశాయి. రాజధాని ఢాకాలోని జియా ఉద్యాన్​లో భర్త జియావుర్​ రహ్మాన్ సమాధి పక్కనే జియా పార్థివదేహాన్ని బుధవారం ఖననం చేశారు. వేలాది ప్రజలు హాజరై అశ్రునయనాల మధ్య వీడ్కోలు పలికారు. అంతకుముందు పార్లమెంట్​ భవనం సమీపంలో ఉన్న మానిక్​ మియా ఎవెన్యూలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి ఖలీదా జియా కుమారుడు తారిఖ్​ రెహ్మాన్​, బంగ్లాదేశ్​ తాత్కాలిక సారథి మహ్మద్​ యూనస్​తో పాటు భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్​, పాకిస్థాన్​, శ్రీలంక, నేపాల్​, భూటాన్​, మాల్దీవుల ప్రతినిధులు హాజరయ్యారు.

అంతకుముందు జియా మృతికి సంతాపం తెలుపుతూ ప్రధాని మోదీ అందించిన సందేశ లేఖను ఆమె కుమారుడు తారిఖ్​ రెహ్మాన్​కు జై శంకర్​ అందజేశారు. జియా మృతికి మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన బంగ్లాదేశ్​ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ జెండా అవనతం చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 10వేల మంది సైనికులు, పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేసింది.

Khaleda Zia Funeral
Khaleda Zia Funeral

Read Also: పుతిన్​ ఇంటిపై దాడి.. వీడియో విడుదల

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>