కలం, వెబ్ డెస్క్ : మహిళా హాస్టల్లోని స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా (Secret Camera) పెట్టిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని (Tamil Nadu) కృష్ణగిరి జిల్లా ఉత్పన్నపల్లి పరిధిలో ఉన్న లాలిక్కల్ గ్రామంలో ఓ ప్రైవేట్ ఉమెన్స్ హాస్టల్ ఉంది. ఇందులో ఒడిశా రాష్ట్రానికి చెందిన నీలుకుమారి గుప్తా (26) ఉంటోంది. అయితే, నీలుకుమారి పంజాబ్ కు చెందిన తన ప్రియుడు రవిప్రతాప్ సింగ్ (29) చెప్పడంతో హాస్టల్ లోని స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది.
ఈ విషయం బయటపడడంతో హాస్టల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రేమికులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై గుండా చట్టం కింద కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ తంగదురై కలెక్టర్ కు సిఫారసు చేశారు. అనంతరం రవిప్రతాప్ సింగ్ని సేలం సెంట్రల్ జైలుకు, నీలుకుమారి గుప్తాను కోవై మహిళా జైలుకు పోలీసులు తరలించారు.
Read Also: ఆటో డ్రైవర్ టు ఎయిర్లైన్స్ ఓనర్.. ‘శంఖ్ ఎయిర్’ చైర్మన్ ఇన్స్పైరింగ్ జర్నీ
Follow Us On: X(Twitter)


