అరోనియన్‌ను చిత్తు చేసిన నిహాల్ సరీన్!

కలం, స్పోర్ట్స్ : బెంగళూరులో గ్లోబల్ చెస్ లీగ్ నాలుగో సీజన్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. అమెరికన్ గాంబిట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత గ్రాండ్‌మాస్టర్ నిహాల్ సరీన్ (Nihal Sarin) ప్రస్తుతం ఈ టోర్నీపైనే పూర్తి దృష్టి పెట్టారు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో లీవొన్ అరోనియన్‌తో తీవ్రంగా పోరాడిన నిహాల్, నల్ల పావులతో ఆడి విజయాన్ని అందుకున్నారు.

అయితే, ఆ మ్యాచ్‌లో గాంజెస్ గ్రాండ్‌మాస్టర్స్ చేతిలో అమెరికన్ గాంబిట్స్ 7-9 తేడాతో ఓటమి పాలైంది. అయినప్పటికీ, లీగ్ పాయింట్ల పట్టికలో 6 మ్యాచ్ పాయింట్లు, 31 గేమ్‌ పాయింట్లతో అమెరికన్ గాంబిట్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు, ఈ నెల చివర్లో ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో చెస్ ఒలింపియాడ్ జరగనుంది. భారత్ తన డిఫెండింగ్ ఛాంపియన్ హోదాను నిలబెట్టుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ జట్టులో పెంటాల హరికృష్ణ స్థానంలో నిహాల్ సరీన్ (Nihal Sarin) చోటు దక్కించుకున్నారు.

నిహాల్‌తో పాటు అర్జున్ ఎరిగైసి, ప్రజ్ఞానంద, గుకేష్, విదిత్ గుజరాతి ఈ జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఒలింపియాడ్ గురించి నిహాల్ మాట్లాడుతూ, దేశానికి ప్రాతినిధ్యం వహించడం తన డ్రీమ్ అని, జట్టు కోసం తన శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. అయితే, ప్రస్తుతం ఆ ఆలోచనలను పక్కనపెట్టి, జిసిఎల్‌ను ప్రశాంతంగా, ఆస్వాదిస్తూ ఆడుతున్నానని ఆయన వెల్లడించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>