కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) నగరంలోని కసాబ్ గల్లీ (49వ డివిజన్)లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కూరగాయల ఉమారాణి (Mayor Umarani) ని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) పరామర్శించారు. ఇటీవల మేయర్ కూరగాయల ఉమారాణి మాతృమూర్తి చనిపోయారు.
ఈ నేపథ్యంలో గురువారం కసాబ్ గల్లీలోని మేయర్ నివాసానికి వెళ్లిన మహేష్ కుమార్ గౌడ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాతృమూర్తి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని సూచించారు.

