epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ప్రతిపక్షాలపై బురదజల్లేందుకే అసెంబ్లీ సమావేశాలు : హరీశ్​ రావు

కలం, వెబ్​ డెస్క్​ : ప్రతిపక్షాల మీద బురద జల్లడం కోసమే అసెంబ్లీ సమావేశాలను కాంగ్రెస్​ నిర్వహించాలనుకుంటుందని బీఆర్ఎస్​ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్​ రావు (Harish Rao) విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో చిట్​ చాట్​  చేశారు. కాంగ్రెస్​ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని హరీశ్​ రావు విమర్శించారు. బీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చిన తరువాత 2014 నుంచి 2019 వరకు ఎక్కువ రోజులు అసెంబ్లీని నడిపించినట్లు హరీశ్​ రావు తెలిపారు.

దాదాపు ఒక సెషన్​ లో 32 రోజులు సభ సమావేశాలను నిర్వహించామని చెప్పుకొచ్చారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో మొత్తం మీద 40 రోజుల మాత్రమే అసెంబ్లీ పెట్టిందని హరీశ్​ రావు విమర్శించారు. సభ నడపాలంటే కాంగ్రెస్ జంకుతుందని.. అసెంబ్లీ సమావేశాలను కచ్చితంగా 15 రోజుల పాటు కొనసాగించాలని హరీశ్​ రావు డిమాండ్​ చేశారు.

గతంలో కాళేశ్వరం (Kaleshwaram) విషయంలో కేసీఆర్ మాట్లాడుతుంటే ఉత్తమ్ కుమార్​రెడ్డి ప్రిపేర్​ అయి రాలేదన్నాడని ఎద్దేవా చేశారు. కానీ, తాము మాత్రం సభకు సిద్ధం​ అయి వస్తున్నామని హరీశ్​ రావు తెలిపారు. తాను ఘోష్​ కమిషన్​ గురించి మాట్లాడుతుంటే ఏడుగురు మంత్రులు అడ్డుకున్నారని.. తాను వాళ్లకు సమాధానం చెప్పాలా? సబ్జెక్ట్​ మాట్లాడాలా? అని హరీష్ రావు (Harish Rao)  ప్రశ్నించారు.

Read Also: ‘జయా ఆంటీ మాలూమ్ తేరా కో’.. అంటే కుదరదంటోన్న సజ్జనార్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>