కలం, వెబ్డెస్క్: ‘అసెంబ్లీ రౌడీ’ మూవీలో మోహన్బాబు జైలు నుంచే నామినేషన్ వేసి, ఎన్నికల్లో గెలిచే సీన్ చాలామందికి గుర్తుండే ఉంటుంది. అది సినిమా. కానీ, అంతకుముందు ఆ తర్వాత కూడా చాలా మంది జైలు నుంచి నామినేషన్లు వేశారు. కొందరు గెలిచారు కూడా. చేయని తప్పునకు అక్రమంగా జైలుపాలైన వాళ్ల సంగతి సరే. చాలా మంది నేరస్థులు, గ్యాంగ్స్టర్లు జైలు నుంచి నామినేషన్ వేయడం మామూలైపోయింది. ఇలాంటిదే ఇప్పుడు పుణె (Pune) కార్పొరేషన్ ఎన్నికల్లో చోటుచేసుకుంది. ఈ నెల 28న జరగనున్న పుణె కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్యాంగ్స్టర్ బందు అందేఖర్ శనివారం నామినేషన్ (Gangster Nomination) దాఖలు చేశాడు.
ఈ సందర్భంగా ముఖానికి నల్లటి ముసుగు వేసి, చేతులను తాళ్లలతో కట్టేసిన నిందితుని పోలీసులు నామినేషన్ (Gangster Nomination) కేంద్రానికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. కాగా, సొంత మనువడు అయిన ఆయుష్ను సెప్టెంబర్ 5న తుపాకీలతో కాల్చి దారుణంగా హత్య చేసిన కేసులో అందేఖర్తోపాటు అతని కుటుంబంలోని మరో 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వీళ్లు పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలో పుణె ఎన్నికల్లో కార్పొరేటర్గా పోటీ చేసేందకు అందేఖర్తోపాటు అతనితో కలసి జైలులో ఉన్న మరో ఇద్దరు మహిళలు ఇండిపెండెంట్లుగా నామినేషన్ వేశారు. వీళ్లు నామినేషన్ వేయడానికి వచ్చేటప్పుడు చేతులూపుతూ, నినాదాలు చేస్తూ వస్తున్న వీడియోను సోషల్ మీడియాలో చూసి, నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
Read Also: క్లీన్ సిటీ కోసం ‘మెగా డ్రైవ్’.. రేపటి నుంచే ప్రారంభం
Follow Us On: Youtube


