epaper
Friday, January 16, 2026
spot_img
epaper

భారీ ప్రమాదం.. టిప్పర్​ని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

కలం, వెబ్​ డెస్క్​ : సంగారెడ్డి(Sangareddy)లో భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న టిప్పర్​ ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది (RTC bus accident). ఈ ప్రమాదంలో 22 మంది ప్రయాణికులకు గాయాలయినట్లు సమాచారం. మెదక్​ నుంచి పటాన్​ చెరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సంగారెడ్డి జిల్లా కంది దగ్గర NH 65పై ఆగి ఉన్న టిప్పర్​ లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 22 మంది కి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది.

Read Also: ఆపరేషన్​ ఆఘట్​ 3.0.. ఢిల్లీలో 331 మంది అరెస్ట్​

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>