కలం, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్ ఆఘాట్ 3.0 (Operation Aghat 3.0) లో భాగంగా నూతన సంవత్సర వేడుకలకు ముందు నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్లో పోలీసులు 331 మందిపై కేసు నమోదు చేశారు. అలాగే, ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యం, వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా వీధి నేరాలు, నేరస్తుల కార్యకలాపాలను అరికట్టడానికి శనివారం ఆగ్నేయ ఢిల్లీలో 600 మంది పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు.
Operation Aghat 3.0 లో ఢిల్లీ ఎక్సైజ్ యాక్ట్, ఎన్డీపీసీ యాక్ట్, పబ్లిక్ గ్యాంబ్లింగ్ చట్టం కింద 331 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే వివిధ నిబంధనల కింద 504 మందిని అరెస్ట్ చేశారు. చెడు ప్రవర్తన కలిగిన 116 మందిని, ఐదుగురు ఆటోలిఫ్టర్లను, నలుగురు నేరస్తులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ పోలీస్ యాక్ట్ ప్రకారం 1306 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గరి నుంచి 21 పిస్టోల్స్, 20 బుల్లెట్లు, 27 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. 12,258 అక్రమ మద్యం బాటీళ్లు, 6.01 కిలోల గంజాయి, జూదగాళ్ల నుంచి రూ.2.36 లక్షల నగదు, 310 ఫోన్లు, ఆరు బైకులు, కార్లు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: కేంద్రంలో వన్ మ్యాన్ షో నడుస్తోంది: రాహుల్ గాంధీ
Follow Us On: Youtube


