epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఇజ్రాయెల్​ దాడిలో ఇరాన్​ ఖుద్స్​ ఫోర్స్​ కమాండర్​ హతం

కలం, వెబ్​డెస్క్​: ఇజ్రాయెల్​ డ్రోన్​ దాడి (Israel drone strike) లో ఇరాన్​కు చెందిన ఖుద్స్​ ఫోర్స్​ టాప్​ కమాండర్​ ఒకరు హతమయ్యారు. ఈ మేరకు ఇజ్రాయెల్ రక్షణ దళాలు, షిన్​బెట్ సెక్యూరిటీ ఏజెన్సీ గురువారం ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. ఇరాన్​ రెవల్యూషనరీ గార్డ్స్​కు అనుబంధంగా ఉన్న ఖుద్స్​ ఫోర్స్​లో హుస్సేన్​ మహమూద్​ మర్షద్​ అల్​ జవహరి సీనియర్​ లెవెల్​ టాప్​ కమాండర్​. ఇజ్రాయెల్​కు వ్యతిరేకంగా జరిగిన అనేక తీవ్రవాద కార్యక్రమాల్లో హస్సేన్ మహమూద్​ కీలక పాత్ర పోషించాడు. లిబియా–సిరియా సరిహద్దు ప్రాంతం నుంచి తన కార్యకలాపాలు కొనసాగించాడు. ఇజ్రాయెల్​కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఎగదోశాడు. దీనికోసం ఖుద్స్​ ఫోర్స్​లోని యూనిట్​–840 విభాగాన్ని వాడుకున్నాడని ఇజ్రాయెల్​ వెల్లడించింది.

ఈ క్రమంలో గురువారం ఈశాన్య లెబనాన్​ వద్ద హుస్సేన్​ మహమూద్​ ఓ వాహనంలో వెలుతున్నట్లు ఇజ్రాయెల్​ దళాలు పసిగట్టాయి. వెంటనే దానిపై డ్రోన్​తో దాడి (Israel drone strike) చేశాయి. ఈ దాడిలో హుస్సేన్​ మహమూద్​ అక్కడికక్కడే మరణించాడు. దాడికి సంబంధించిన వీడియోను ఇజ్రాయిల్​ విడుదల చేసింది. కాగా, దాడిని లెబనాన్​ అధికారిక మీడియా ధ్రువీకరించింది. సిరియా సరిహద్దులో జరిగిన ఒక వాహనంపై జరిగిన దాడిలో ఇద్దరు మరణించారని పేర్కొంది. అయితే, చనిపోయినవాళ్ల వివరాలు వెల్లడించలేదు.

Read Also: నేతాజీ అవశేషాలు భారత్​కు తెప్పించండి.. రాష్ట్రపతికి ముని మనవడి లేఖ

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>