కలం, వెబ్ డెస్క్ : రాజధానిలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ నిరసన ప్రదర్శనలో విధుల్లో ఉన్న ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) జవాన్పై కొందరు నిరసనకారులు అమానుషంగా దాడికి పాల్పడ్డారు. జవాన్ను రోడ్డుపై వెంటాడి, చితకబాదిన (RAF Jawan Attack) దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ కావడంతో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఈ హింసాత్మక ఘటనపై ఢిల్లీ పోలీసులు తక్షణమే స్పందించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, ప్రభుత్వ ఉద్యోగిపై దాడికి తెగబడటం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద నిరసనకారులపై కేసులు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వైరల్ వీడియోల ఆధారంగా దాడికి పాల్పడిన నిందితులను గుర్తించే ప్రక్రియను ప్రారంభించామని పోలీసులు తెలిపారు.
హింసను ప్రేరేపించిన వారిని, జవాన్పై ప్రత్యక్షంగా దాడి చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, చట్టప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం సదరు ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

