కలం, మెదక్ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి లోని తన ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. కేటిఆర్ కుమారుడు హిమాన్షు పుట్టిన రోజు నేడు. దీంతో తన మనవడి జన్మదిన వేడుకల్లో పాల్గొనడానికి కేసీఆర్ హైదరాబాద్ బయలుదేరినట్లు తెలుస్తోంది. ఇటీవల జిమ్లో గాయపడిన మనవడు హిమాన్షు ను హాస్పిటల్ లో కేసీఆర్ పరమర్శించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో గల ఏఐజీ (AIG) ఆసుపత్రికి వెళ్లి హిమాన్షును పరామర్శించి మనువడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు.

