Mobile Popup Ad
Mobile Popup Ad

డీపీఎల్ మహిళల వేలంలో రికార్డు ధర

కలం, స్పోర్ట్స్: డెల్హీ ప్రీమియర్ లీగ్ (DPL) మహిళల T20 వేలంలో భారీ బిడ్డింగ్‌తో ఉత్కంఠ రేపిన క్షణాలు చోటుచేసుకున్నాయి. ఈ వేలంలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ పారునిక సిసోడియా అత్యధిక ధరకు అమ్ముడై అందరి దృష్టిని ఆకర్షించింది. ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ ఆమెను రూ.14 లక్షలకు సొంతం చేసుకుంది. దీంతో ఆమె ఈ సీజన్‌లో టాప్ బైగా నిలిచింది. ఈ వేలంలో నాలుగు ఫ్రాంచైజీలు తమ జట్లను మరింత బలంగా తీర్చిదిద్దేందుకు తీవ్రంగా పోటీ పడ్డాయి.

ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ పారునికతో పాటు సిమ్రన్ దిల్ బహదూర్‌ను కూడా దక్కించుకుంది. సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ భారత బ్యాటర్ ప్రియా పునియాను జట్టులోకి తీసుకుంది. సెంట్రల్ ఢిల్లీ క్వీన్స్ ఆల్‌రౌండర్ అరు‌షి గోయల్‌ను రూ.11 లక్షలకు కొనుగోలు చేసింది. నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ తమ బౌలింగ్ బలాన్ని పెంచుకునేందుకు ప్రియా మిశ్రాను జట్టులో చేర్చుకుంది. ఈ వేలంలో రెండో అత్యధిక ధర అరు‌షి గోయల్‌కు లభించింది. ఆమెను సెంట్రల్ ఢిల్లీ క్వీన్స్ భారీ పోటీలో సొంతం చేసుకుంది.

టాప్ ధరలు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో పారునిక సిసోడియా, అరు‌షి గోయల్‌తో పాటు సుమితి సోని, సిమ్రన్ దిల్ బహదూర్, పూర్వా సివచ్, సమైరా రాఘవ్, ప్రజ్ఞా రావత్ ఉన్నారు. ఫ్రాంచైజీలు రైట్ టు మ్యాచ్ (RTM) కార్డులను కూడా వ్యూహాత్మకంగా ఉపయోగించాయి. ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ ప్రజ్ఞా రావత్‌ను తిరిగి జట్టులోకి తీసుకోగా, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ సమైరా రాఘవ్‌ను రిటైన్ చేసుకుంది. వేలం ముగిసే సమయానికి నాలుగు జట్లు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు, యువ ప్రతిభతో సమతుల్యమైన స్క్వాడ్‌లను సిద్ధం చేసుకున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>