epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఫ్యూచర్​ సిటీపై కేసీఆర్​ సెటైర్స్​

కలం, వెబ్​ డెస్క్​ : ఫ్యూచర్​ సిటీ.. తొక్క సిటీ ఎవడికి కావాలంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)​ ప్రభుత్వంపై సెటైర్స్​ వేశారు. తెలంగాణ భవన్​ లో జరుగుతున్న మీడియా సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్​ కాంగ్రెస్​ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఫార్మా సిటీ కోసం తమ ప్రభుత్వం సేకరించిన భూములను కాంగ్రెస్​ ప్రభుత్వం అమ్ముకోవాలని చూస్తున్నదని తీవ్ర ఆరోపణలు చేశారు.

అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది అంటూ ఫ్యూచర్​ సిటీపై  KCR స్పందించారు. 400 ఏళ్లుగా పెరిగి హైదరాబాద్​ ఉన్నత నగరంగా మారిందన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఫార్మా సిటీని రూపొందించామన్నారు. కానీ, ఫార్మా సిటీని పక్కన పెట్టి ఫ్యూచర్​ సిటీ పేరుతో కాంగ్రెస్​ ప్రభుత్వం నాశనం పట్టిస్తుందని కేసీఆర్​ దుయ్యబట్టారు. ఫార్మా సిటీ కోసం తాము సేకరించిన భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముకుంటుందని కేసీఆర్ ఆరోపించారు.

Read Also: రెండేళ్లు ఆగాము.. ఇక ఆగేది లేదు.. నేను కూడా హాజరవుతా -KCR

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>