కలం, వెబ్ డెస్క్: అభివృద్ధి పథంలో కొనసాగిన తెలంగాణలో ఇప్పుడు క్రైం రేటు పెరిగిపోయిందని కేసీఆర్(KCR) ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్ లో న నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన… కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నగరంలో శాంతిభద్రతలు కరువయ్యాయన్నారు. పట్టపగలు హత్యలు జరుగుతుంటే అడిగేవారే లేరని మండిపడ్డారు. ఎంత సేపూ రియల్ ఎస్టేట్ ధ్యాస తప్పా వేరే ధ్యాసే లేదని కేసీఆర్ అన్నారు. ఇకపై ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తామని, అన్యాయాలపై ప్రశ్నిస్తామని కేసీఆర్ తెలిపారు. ఇంట్లోకి వచ్చి దోచుకుపోతామంటే ఊరుకుంటామా అని ప్రశ్నించారు.
యూరియా, ఎరువులను సకాలంలో అందజేస్త లేరని కేసీఆర్ పేర్కొన్నారు. దీనికోసం ఒక యాప్ ఏర్పాటు చేస్తున్నారని.. అది ఒక దిక్కుమాలిన యాప్ అని పేర్కొన్నారు. రెండుసార్లు రైతుబంధు ఎగ్గొట్టారని, పింఛన్లు ఎగ్గొట్టారని, భయంకరమైన పరిస్థితిని రాష్ట్రంలో తీసుకువచ్చారని అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తం, కొత్త ఉద్యోగాలు ఇస్తం, జాబ్ క్యాలెండర్ ఇస్తం అని.. చెప్పడంతో ప్రజలు నమ్మి ఓటేశారన్నారు. కానీ ఆ హామీలు నెరవేర్చట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. “బహిరంగ సభలు నిర్వహిస్తాం. నేను కూడా హాజరవుతా. ప్రభుత్వాన్ని నిలదీస్తాం.. ఇప్పటికే రెండేళ్లు ఆగామని.. ఇక ఆగేది లేదని” కేసీఆర్(KCR) పేర్కొన్నారు.
Read Also: జర్నలిస్టు రాహుల్కి సారీ చెప్పిన కేసీఆర్
Follow Us On: Youtube


