epaper
Friday, January 16, 2026
spot_img
epaper

డిసెంబర్ ఓ మిరాకిల్​ మంత్​ : సీఎం రేవంత్

కలం, వెబ్​ డెస్క్​ : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో(LB Stadium) నిర్వహించిన క్రిస్మస్​ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్వేషించే వారిని కూడా ప్రేమించే గుణాన్ని ఏసు ప్రభువు నింపారన్నారు. కాంగ్రెస్​ పార్టీకి డిసెంబర్​  ఒక మిరాకల్ మంత్ అని, రాజకీయంగా భారీ నష్టం జరిగిన్పటికి సోనియా గాంధీ (Sonia Gandhi) తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించారని తెలిపారు. ఇదే డిసెంబర్​ లో తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడిందని సీఎం గుర్తు చేశారు.

శాంతిని కాపాడుతూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఏసు ప్రభువు బోధనల స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం స్పష్టం చేశారు. పేదల ఆకలి తీర్చాలని ఆనాడు కాంగ్రెస్​ పార్టీ ఆహార భద్రత చట్టం తెచ్చిందని చెప్పారు. ఇప్పుడు పేదవాడి ఆకటి తీరాలని నెలకు ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం అందిస్తున్నామన్నారు. ఉచిత కరెంట్​ తో పేదల ఇళ్లల్లో వెలుగులు నింపామని రేవంత్​ రెడ్డి తెలిపారు. ఏసు ప్రభువు బోధనల స్పూర్తితో ప్రజా పాలన సాగిస్తున్నామన్నారు. ఇతర మతాలను కించపరిచే మాటలు మాట్లాడితే కఠిన చర్యలు తీసుకునేలా త్వరలో అసెంబ్లీలో కొత్త చట్టం తీసుకువస్తామని సీఎం రేవంత్​ రెడ్డి ప్రకటించారు.

కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన రెండళ్లలోనే వ్యవసాయంపై రూ.1.04 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని వెల్లడించారు. క్రిస్టియన్​ మిషనరీలు ప్రభుత్వంతో పోటిపడి విద్య, వైద్యం అందించాయని సీఎం రేవంత్​ రెడ్డి (Revanth Reddy) కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్​, అజారుద్దీన్​, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్​, వాకిటి శ్రీహరి, టీపీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్​ గౌడ్​, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ తదితరులు పాల్గొన్నారు.

Read Also: వీకెండ్ డెస్టినేషన్ గా వరంగల్.. బ్రోచర్ ఆవిష్కరించిన కొండా సురేఖ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>