epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

టాస్క్​ఫోర్స్ పోలీసులకు సజ్జనార్​ షాక్​

కలం, వెబ్​ డెస్క్​ : హైదరాబాద్​ టాస్క్​ ఫోర్స్​ పోలీసులకు సీపీ సజ్జనార్​ (CP Sajjanar) షాక్​ ఇచ్చారు. ఒకేసారి 80 మంది సిబ్బంది బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్​ఐ నుంచి కానిస్టేబుల్​ ర్యాంకు ఉన్న అధికారులను అటాచ్​ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కొందరు అధికారులు కొన్నేళ్లుగా టాస్క్​ ఫోర్స్​ డిపార్ట్​ మెంట్ లోనే పాతుకుపోయారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన టాస్క్​ ఫోర్స్​ అధికారులపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఓ నిందితుడిని తప్పించేందుకు అధికారి భారీగా డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో టాస్క్​ ఫోర్స్​ విభాగంపై సీపీ సజ్జనార్​ స్పెషల్​ ఫోకస్​ పెట్టారు. దీంతో టాస్క్​ ఫోర్స్​ డిపార్ట్​ మెంట్ ప్రక్షాళనకు సీపీ సజ్జనార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Read Also: వీకెండ్ డెస్టినేషన్ గా వరంగల్.. బ్రోచర్ ఆవిష్కరించిన కొండా సురేఖ

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>