epaper
Friday, January 16, 2026
spot_img
epaper

నాంపల్లి కోర్టుకు వెళ్లిన సీఎం రేవంత్​ రెడ్డి.. ఎందుకంటే

కలం, వెబ్ డెస్క్​ : సీఎం రేవంత్​ రెడ్డి (Revanth Reddy) నాంపల్లి లోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. గతంలో ఉస్మానియా యూనివర్సిటీ, తిరుమలగిరి, మట్టంపల్లి పోలీస్ స్టేషన్​ లో నమోదైన కేసుల సందర్భంగా ముఖ్యమంత్రి శనివారం నాంపల్లి(Nampally)లోని మనోరంజన్​ కోర్టుకు వెళ్లారు. ఈ మూడు కేసులకు సంబంధించి విచారణ పూర్తయినట్లు తెలుస్తోంది. ఓయూలో నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ సభ నిర్వహణపై 2016లో రేవంత్​ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

దీంతో పాటు వివిధ కారణాలతో తిరుమలగిరి, మట్టంపల్లి పోలీస్​ స్టేషన్లలో నమోదయిన కేసులను కొట్టివేయాలని రేవంత్​ రెడ్డి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించారు. రాజకీయ ఒత్తిళ్లతోనే తనపై అక్రమంగా కేసులు పెట్టారని పిటిషన్​ వేశారు. ఈ పిటిషన్ పై ప్రస్తుతం నాంపల్లి ప్రజాప్రతినిధుల నడుస్తున్న విచారణకు సీఎం రేవంత్​ రెడ్డి (Revanth Reddy) వ్యక్తిగతంగా వెళ్లారు.

Read Also: ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి : కేటీఆర్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>