Mobile Popup Ad
Mobile Popup Ad

అమెరికా పౌరసత్వం వదిలి.. 94 ఏళ్ల బామ్మ సంచలన నిర్ణయం!

కలం, వెబ్ డెస్క్ : సొంత గడ్డపై ఉన్న మమకారం, పుట్టిన నేలపై గల అనుబంధం ఎంతటివారినైనా కట్టిపడేస్తాయి. జీవిత చరమాంకంలో మాతృభూమి ఒడికి చేరుకోవాలనే ఒక వృద్ధురాలి సంకల్పం ప్రస్తుతం అందరినీ కదిలిస్తోంది. బాపట్ల (Bapatla) జిల్లాకు చెందిన 94 సంవత్సరాల మహాలక్ష్మమ్మ 2000 వ సంవత్సరంలో అమెరికా పౌరసత్వం తీసుకుని అక్కడే స్థిరపడ్డారు. అయితే, తన శేష జీవితాన్ని కన్ననేలపైనే గడపాలనే కోరికతో ఆమె తిరిగి భారతదేశానికి చేరుకున్నారు. తన చివరి శ్వాసను కూడా మాతృభూమిలోనే విడవాలనే భావనతో భారత పౌరసత్వం (Indian Citizenship) కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నారు.

తన అంత్యక్రియలు కూడా సొంత గ్రామంలోనే జరగాలని, వీలైనంత త్వరగా తనకు భారత పౌరసత్వం కల్పించాలని కోరుతూ మహాలక్ష్మమ్మ బాపట్ల (Bapatla) జిల్లా కలెక్టర్‌కు విన్నవించారు. 94 ఏళ్ల వయసులో మాతృభూమి పిలుపును అందుకుని ఆమె తీసుకున్న ఈ నిర్ణయం, స్వదేశంపై ఆమెకు ఉన్న భక్తిని చాటిచెబుతూ పలువురిని భావోద్వేగానికి గురిచేస్తోంది.

Read Also: రైతులకు సోలార్ ‘పంట’.. త్వరలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>