కలం, నిజామాబాద్ బ్యూరో : ఇటీవల కురిసిని వడగండ్ల వర్షం పంట పొలాలకు తీవ్ర నష్టం చేసింది. నిజామాబాద్ జిల్లా చందూర్ (Chandur) మండలం కారేగాం తండాలో అకాల వానలకు నష్టపోయిన పంట పొలాలను మండల వ్యవసాయ అధికారి కృష్ణా రెడ్డి, జీపీవో మోహన్ సందర్శించారు. ఇటీవలి వడగండ్ల వానకు తండాలో 700 ఎకరాల్లో పంట నష్టం జరగగా.. బాధిత రైతులతో కలిసి అధికారులు పంట నష్టాన్ని అంచనా వేశారు. వివరాలను ప్రభుత్వానికి నివేదిక పంపుతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డాక్టర్ రామావత్ లాల్ సింగ్, మాజీ సొసైటీ చైర్మన్ చంద్రు నాయక్, గ్రామ రైతులు పాల్గొన్నారు.

