కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు (Patancheru) పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్తంగి ఓఆర్ఆర్ ఎగ్జిట్ – 3 సమీపంలో పోలీసులు భారీగా ఎత్తున గంజాయి పట్టుకున్నారు. సోమవారం కూకట్ పల్లి ఎస్వోటీ పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఒరిస్సా నుండి షోలాపూర్ వైపు తరలిస్తున్న 400 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు గంజాయి పెడ్లర్లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ఒక కారు, ఒక ఐచర్ వ్యాన్, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పటాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

